ఆంధ్రా పల్స్
Date of Publish : 24 August 2026, 11:29 am Posted by : ఆంధ్రా పల్స్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 116 అర్జీలు

ఆంధ్రా పల్స్ – నరసరావుపేట: నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 116 అర్జీలు అందాయి. ప్రజల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులు సూచించారు. రెవెన్యూ క్లినిక్‌ ద్వారా 35 దరఖాస్తులు స్వీకరించారు.