ఆంధ్రా పల్స్
Date of Publish : 24 August 2026, 11:16 am Posted by : ఆంధ్రా పల్స్

గుంటూరు కార్పొరేషన్లో ఏసీబీ దాడులు

ఆంధ్రా పల్స్ – గుంటూరు: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 10 మందికి పైగా ఏసీబీ ఆధికారులు ఒక్కసారిగా ఇంజనీరింగ్ విభాగంపై దాడి చేసి ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.

దీనిపై ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు జీఎంసీ ఇంజనీరింగ్ విభాగంపై పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు ఇంజినీరింగ్ విభాగంలో టెండర్లు పర్సెంటెజ్ మార్చేసి కొంత అవకతవకలపై విచారణ చేస్తున్నామని. మొత్తం 156 ఫైల్స్‌లో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ లైన్స్ పనుల్లో జరిగిన అవకతవలపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.