శాఖల్లో సమర్ధత – సేవల్లో నాణ్యత
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం డేటా ఇంటిగ్రేషన్ డెంగీ, మలేరియా నివారణకు హాట్స్పాట్ల గుర్తింపు ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం ఆంధ్రా పల్స్ - అమరావతి: ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చెయిన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలన్నారు. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి...